Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసి పదేళ్ల క్రితం పారిపోయిన భార్య, కరోనా పుణ్యమా అంటూ గ్రామంలోకి తిరిగివస్తే?

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (22:45 IST)
తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా ఉసిలిపట్టి సమీపంలోని ఒక వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో 15యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మంచి కుటుంబమని అందరూ చెప్పుకునేవారు. వీరి జీవితం సాఫీగానే సాగిపోయేది.
 
అయితే ఆమె తన ఇంటి పక్కనే ఉన్న ఒక యుకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రెండు నెలల పాటు ఈ తంతు సాగింది. ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. అయితే అది కాస్తా బయటపడింది. ఇంట్లో ఉంటే భర్త చంపేస్తాడన్న భయంతో ప్రియుడితో కలిసి పారిపోయింది.
 
చెన్నై సిటీలో పదిసంవత్సరాల పాటు వీరు సహజీవనం చేశారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఆ యువకుడు ఆమెను వదిలేసి తన స్వగ్రామానికి వచ్చేశాడు. తాను ఒంటరిగా చెన్నైలో ఉండలేక సొంత గ్రామంలో భర్త దగ్గరకు వచ్చింది.
 
ఆ మహిళను చూసిన భర్త, అతని స్నేహితులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెను నిన్న రాత్రి రోడ్డుపై లాక్కుంటూ వచ్చి కర్రలతో కొట్టారు. తలపై ఆ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
 
అలాగే యువకుడిని వారి తల్లిదండ్రులు దాచి ఉంచే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు అతనిపైనా దాడి చేయడంతో అతనికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. దాడిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments