Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ప్రాణాలు తీసిన మూఢనమ్మకం... ఎక్కడ?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (12:30 IST)
మూఢ నమ్మకం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఓ మహిళకు దెయ్యం పట్టింది. దీన్ని తొలగిస్తానని నమ్మించిన ఓ తాంత్రికుడు ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో ఆ మహిళ అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలోని పత్వారియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రియ సక్సేనాను ఆరు సంపత్సరాల క్రితం ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. కొంతకాలం తర్వాత భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఈ క్రమంలో  ఓ తాంత్రికుడితో పరిచయం ఏర్పడింది. వారి కుటుంబం గురించిఅతడు పూర్తిగా తెలుసుకున్నాడు.
 
ప్రియ పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ కుటుంబానికి మాయమాటలు చెప్పాడు. ప్రియకు దెయ్యం ఆవహించిందని తాను దానిని వదిలిస్తానని ఆ కుటుంబ సభ్యులను నమ్మించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా అతని మాటలు నమ్మారు. హోమం చేయాల్సి ఉంటుందని చెప్పి శనివారం ఇంట్లోనే అందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆ మాంత్రికుడు ఉత్తుత్తి మంత్రాలు చదవుతూ.. ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో తీవ్ర అనారోగ్యం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments