Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ప్రాణాలు తీసిన మూఢనమ్మకం... ఎక్కడ?

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2023 (12:30 IST)
మూఢ నమ్మకం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఓ మహిళకు దెయ్యం పట్టింది. దీన్ని తొలగిస్తానని నమ్మించిన ఓ తాంత్రికుడు ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో ఆ మహిళ అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలోని పత్వారియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రియ సక్సేనాను ఆరు సంపత్సరాల క్రితం ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. కొంతకాలం తర్వాత భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఈ క్రమంలో  ఓ తాంత్రికుడితో పరిచయం ఏర్పడింది. వారి కుటుంబం గురించిఅతడు పూర్తిగా తెలుసుకున్నాడు.
 
ప్రియ పరిస్థితిని అర్థం చేసుకుని, ఆ కుటుంబానికి మాయమాటలు చెప్పాడు. ప్రియకు దెయ్యం ఆవహించిందని తాను దానిని వదిలిస్తానని ఆ కుటుంబ సభ్యులను నమ్మించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా అతని మాటలు నమ్మారు. హోమం చేయాల్సి ఉంటుందని చెప్పి శనివారం ఇంట్లోనే అందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆ మాంత్రికుడు ఉత్తుత్తి మంత్రాలు చదవుతూ.. ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో తీవ్ర అనారోగ్యం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments