Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాలిపడి స్నేహితుడికి ఆశ్రయమిస్తే అతడి భార్యనే లేపుకెళ్లిపోయాడు

Webdunia
శనివారం, 23 మే 2020 (16:32 IST)
జాలిపడి స్నేహితుడికి ఆశ్రయమిస్తే అతడి భార్యనే లేపుకుపోయాడు ఒక వ్యక్తి. లాక్‌డౌన్ కారణంగా తిండి దొరకక అల్లాడుతున్న స్నేహితునికి ఆశ్రయమిస్తే మొదటికే మోసం వచ్చింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇడుక్కీ జిల్లా మున్నార్ గ్రామానికి చెందిన లోథారియో మువత్తుపుజ పట్టణంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.
 
లాక్‌డౌన్ విధించడంతో ఇంటికి వెళ్లే దిక్కులేక అక్కడే చిక్కుకుపోయాడు. తిండికి కూడా కరువైంది. ఇబ్బందులతో సతమతమవుతున్న అతనికి అదే పట్టణంలో ఉంటున్న చిన్ననాటి స్నేహితుడు గుర్తుకువచ్చాడు. తన బాధను అతనితో పంచుకున్నాడు. జాలి పడిన స్నేహితుడు ఇంటికి తీసుకువచ్చి తిండి పెట్టి ఆశ్రయమిచ్చాడు.
 
సాయం పొందిన కృతజ్ఞత కూడా మరిచిపోయి స్నేహితుని భార్యపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకుని సుఖంగా చూసుకుంటానని చెప్పి నమ్మబలికాడు. ఆమెను వెంట తీసుకుని వెళ్లిపోయాడు. దీనితో ఏమి చేయాలో తెలియక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. భార్యను పిల్లలను మోసగించి తీసుకువెళ్లిపోయాడని మొరపెట్టుకున్నాడు.
 
పోలీసులు వారి జాడను కనిపెట్టి స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే భార్య మాత్రం ప్రియుడితోనే జీవితం సాగిస్తానని మొండికేసింది. పోలీసులు అక్రమ సంబంధం కేసు పెడతామని బెదిరించడంతో దారిలోకి వచ్చింది. నమ్మిన స్నేహితుడే మోసం చేయడంతో బాధితుడు ఆవేదన చెందుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments