Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమంత.. మళ్లీ ఆ బ్యానర్లో సినిమా చేస్తుందా..? (video)

సమంత.. మళ్లీ ఆ బ్యానర్లో సినిమా చేస్తుందా..? (video)
, శనివారం, 23 మే 2020 (12:16 IST)
ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో ఆకట్టుకుని.. అనతి కాలంలోనే ప్రేక్షక హృదయాలను దోచుకున్న కథానాయిక సమంత. ఇప్పటివరకు సమంత నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యుండచ్చు కానీ... ఆమె పాత్రలు మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు.
 
ఇంకా చెప్పాలంటే... ఏ మాయ చేసావే సినిమాలో జెస్సీ పాత్ర అయినా... రంగస్థలంలో రామలక్ష్మి పాత్ర అయినా.. మజిలీలో శ్రావణి పాత్ర అయినా... ఓ బేబిలో బేబి పాత్ర అయినా... ఆమె తప్ప ఇంకెవరు అలా నటించలేరు అనేంతగా నటించి మెప్పించింది.. దటీజ్ సమంత అనిపించింది.
 
 అయితే... ఓ బేబి తర్వాత జాను సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలో నటించనుంది అనేది ఇంకా అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో సమంత ఓ సినిమా చేయనున్నట్టు తెలిసింది. లేడీ ఓరియంటెడ్ మూవీగా రూపొందే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ కథాంశంతో రూపొందే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం కానుంది అనేది తెలియాల్సివుంది.
 
గతంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాల్లో సమంత నటించింది. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో పాటు సమంతకు మంచి పేరు తీసుకువచ్చాయి మరి.. ఈసారి ఎలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుందో..? ఎవరి సరసన నటించనుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్.. కౌగిలింత, కిస్ సీన్స్ కూడా తగ్గిపోతాయ్: సీరత్ కపూర్