Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేనుకి నీళ్లు పెడుతున్న రైతులపైకి అమాంతం దూకిన చిరుతపులి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (16:00 IST)
ఇటీవలి కాలంలో వన్యమృగాలు అడవులను వదిలి ఊళ్లపై పడుతున్నాయి. తెలంగాణలో ఆమధ్య పెద్దపులి ఇద్దర్ని పొట్టనపెట్టుకుంది. కర్నాటకలోనూ చిరుతపులుల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ చిరుతపులి చేను నీళ్లు పెట్టుకుంటున్న రైతులపై మెరుపుదాడి చేసింది.
 
కర్నాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా బులపురలో గాడిగెప్ప, క్రిష్ణప్ప అనే ఇద్దరు రైతులు వేకువజామున 3 గంటలకు పొలంకి నీరు పెట్టేందుకు వెళ్లారు. వారు నీళ్లు పెడుతున్న సమయంలో వెనుక నుంచి హఠాత్తుగా ఇద్దరి రైతులపైకి దూకి దాడి చేసింది. చిరుత నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు రైతులు తీవ్రంగా పోరాడారు.
 
పక్కనే వున్న పెద్ద బండరాయితో చిరుతపై దాడి చేసి హతమార్చారు. చిరుత దాడిలో గాడిగెప్పకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిష్ణప్పకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా వేసవి కావడంతో వన్యప్రాణులు ఊళ్లవైపు వచ్చే అవకాశం వుందనీ, అటవీ ప్రాంతాలకు సమీపంలో వున్న ప్రజలు అప్రమత్తంగా వుండాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచినీటి కోసం జంతువులు రావచ్చనీ, ఊరి బయట జంతువులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments