Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేనుకి నీళ్లు పెడుతున్న రైతులపైకి అమాంతం దూకిన చిరుతపులి

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (16:00 IST)
ఇటీవలి కాలంలో వన్యమృగాలు అడవులను వదిలి ఊళ్లపై పడుతున్నాయి. తెలంగాణలో ఆమధ్య పెద్దపులి ఇద్దర్ని పొట్టనపెట్టుకుంది. కర్నాటకలోనూ చిరుతపులుల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ చిరుతపులి చేను నీళ్లు పెట్టుకుంటున్న రైతులపై మెరుపుదాడి చేసింది.
 
కర్నాటక రాష్ట్రంలోని హవేరి జిల్లా బులపురలో గాడిగెప్ప, క్రిష్ణప్ప అనే ఇద్దరు రైతులు వేకువజామున 3 గంటలకు పొలంకి నీరు పెట్టేందుకు వెళ్లారు. వారు నీళ్లు పెడుతున్న సమయంలో వెనుక నుంచి హఠాత్తుగా ఇద్దరి రైతులపైకి దూకి దాడి చేసింది. చిరుత నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు రైతులు తీవ్రంగా పోరాడారు.
 
పక్కనే వున్న పెద్ద బండరాయితో చిరుతపై దాడి చేసి హతమార్చారు. చిరుత దాడిలో గాడిగెప్పకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని చిత్రదుర్గ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిష్ణప్పకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా వేసవి కావడంతో వన్యప్రాణులు ఊళ్లవైపు వచ్చే అవకాశం వుందనీ, అటవీ ప్రాంతాలకు సమీపంలో వున్న ప్రజలు అప్రమత్తంగా వుండాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచినీటి కోసం జంతువులు రావచ్చనీ, ఊరి బయట జంతువులకు నీటి తొట్టెలను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments