Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు కూల్ డ్రింకులో మత్తుమందు, నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (12:00 IST)
కేరళ రాష్ట్రం తిరువనంతపురంకు చెందిన మహిళపై కట్టుకున్న భర్త కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి తన నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా తన ఐదేళ్ల కుమారుడు కళ్ల ముందే జరిగింది. కేళలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
నిన్నరాత్రి మహిళ భర్త తన నలుగురు స్నేహితులను ఇంటికి తీసుకవచ్చాడు. పూటుగా మద్యం సేవించారు. అనంతరం భార్యకు తెలియకుండా కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఆమెతో తాగించారు. ఆమె కాస్త అపస్మారకంలోకి వెళ్లాక తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అత్యాచారం చేస్తూ ఆమె శరీరంపై సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిపై అత్యాచారం, కిడ్నాప్ తదితర కేసులు నమోదు చేశారు. సంఘటనపై స్పందించిన కేరళ రాష్ట్ర వైద్య శాఖామంత్రి శైలజ, జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కేసును వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం