Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురితో పెళ్లి.. ఏడోసారి జంప్

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (14:34 IST)
ఓ కిరాణా కొట్టు యజమాని ఆరుగురు మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడవ సారి ఓ అమ్మాయితో జంప్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు, దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  దిండుక్కల్, తెన్నంపట్టి ప్రాంతానికి చెందిన మురుగన్.. ఓ కిరాణా కొట్టు యజమాని. ఇతడు ఆరుగురిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్నాడు. 
 
ఆరోసారిగా రాధ అనే మహిళను పెళ్లాడాడు. పెళ్లైన కొద్దిరోజులకు వీరి వివాహం సజావుగా సాగింది. వీరికి ఓ అబ్బాయి పుట్టాడు. రాధ రెండోసారి గర్భం దాల్చింది. కానీ ‌మురుగన్‌కున్న అప్పులతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మురుగన్ కొద్ది రోజుల క్రితం కనిపించకుండాపోయాడు. భర్త కనిపించకపోవడంతో రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు షాకయ్యే వివరాలు వెలుగులోకి వచ్చాయి. మురగన్ ఐదుగురు మహిళలను వివాహం చేసుకుని మోసం చేశాడని, ఆరో భార్య రాధను వదిలి ఏడోసారిగా ఓ అమ్మాయితో లేచిపోయాడని తెలిసింది. దీంతో తాను మోసపోయాననే వార్తవిని ఆ గర్భిణిగా వున్న రాధ షాకైంది. పరారీలో వున్న మురుగన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments