Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురితో పెళ్లి.. ఏడోసారి జంప్

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (14:34 IST)
ఓ కిరాణా కొట్టు యజమాని ఆరుగురు మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏడవ సారి ఓ అమ్మాయితో జంప్ అయ్యాడు. ఈ ఘటన తమిళనాడు, దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  దిండుక్కల్, తెన్నంపట్టి ప్రాంతానికి చెందిన మురుగన్.. ఓ కిరాణా కొట్టు యజమాని. ఇతడు ఆరుగురిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్నాడు. 
 
ఆరోసారిగా రాధ అనే మహిళను పెళ్లాడాడు. పెళ్లైన కొద్దిరోజులకు వీరి వివాహం సజావుగా సాగింది. వీరికి ఓ అబ్బాయి పుట్టాడు. రాధ రెండోసారి గర్భం దాల్చింది. కానీ ‌మురుగన్‌కున్న అప్పులతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మురుగన్ కొద్ది రోజుల క్రితం కనిపించకుండాపోయాడు. భర్త కనిపించకపోవడంతో రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు షాకయ్యే వివరాలు వెలుగులోకి వచ్చాయి. మురగన్ ఐదుగురు మహిళలను వివాహం చేసుకుని మోసం చేశాడని, ఆరో భార్య రాధను వదిలి ఏడోసారిగా ఓ అమ్మాయితో లేచిపోయాడని తెలిసింది. దీంతో తాను మోసపోయాననే వార్తవిని ఆ గర్భిణిగా వున్న రాధ షాకైంది. పరారీలో వున్న మురుగన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments