Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తింటివారు వేధిస్తున్నారు.. గృహ హింస చట్టంలో మార్పులు చేయాలి..

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (10:56 IST)
తమను కట్టుకున్న భార్యలతో పాటు అత్తింటివారు వేధిస్తున్నారని అందువల్ల తమకు రక్షణ కల్పించేలా గృహహింస చట్టంలో మార్పులు చేయాలని భార్యా బాధితుల సంఘం (భర్తలు) కోరుతున్నారు. గృహ హింస చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమ భార్యలు, అత్తింటివారు వేధిస్తున్నారంటూ వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల గృహ హింస చట్టంలో తక్షణం మార్పులు చేయాలని వారు కోరారు. 
 
ఈ మేరకు సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి భార్యా బాధితుల సంఘం సభ్యులు ఆదివారం కర్నాటక రాజధాని బెంగుళూరులో నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్ష ఆదివారం సాయంత్రం వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి గృహహింస చట్టంలో మార్పులు చేసి దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్  చేశారు. లేదంటే ఆందోళనకు కొనసాగిస్తామని భార్యా బాధితుల సంఘం తెలిపింది.
 
గృహహింస చట్టాన్ని ఉపయోగించిన కొందరు మహిళలు ఎన్నారై భర్తలను, వారి కుటుంబసభ్యులను వేధిస్తున్నారని భార్యా బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. గృహ హింస కేసులను ఎదుర్కొంటున్న ఎన్నారైల కోసం ప్రత్యేక ప్యాయస్థానాలు ఏర్పాటుచేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments