Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే యువతిని ముగ్గురు వ్యక్తులతో పెళ్లి ఖాయం చేశాడు..

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (11:04 IST)
కమిషన్‌కు ఆశపడి ఒకే యువతిని ముగ్గురు వ్యక్తులకు పెళ్లి సంబంధం ఖాయం చేసిన బ్రోకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లాకు చెందిన ఆత్తూరుకు చెందిన తాండవరాయపురానికి చెందిన శక్తి వేల్ అనే వ్యక్తి వధువు కోసం వెతుకులాట ప్రారంభించాడు.


ఈ నేపథ్యంలో బ్రోకర్ కుమార్ అనే వ్యక్తిని సంప్రదించాడు. అతడు కేరళలో తనకు తెలిసిన అమ్మాయి వుందని.. ఆమె పేరు రమ్య అంటూ నమ్మించాడు. ఇంకా ఆ అమ్మాయి ఫోటోను కూడా చూపించాడు. 
 
ఫోటో చూసిన వెంటనే శక్తివేల్‌కు ఆ అమ్మాయి నచ్చడంతో.. ఇక నిశ్చితార్థం చేయాలని చెప్పేశాడు. ఈ క్రమంలో రమ్యకు, శక్తివేల్‌కు రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్‌మెంట్‌లో భాగంగా రమ్యకు శక్తివేల్ ఉంగరాన్ని తొడిగాడు. ఇక బ్రోకర్‌కు రూ.25వేలు ఇచ్చాడు. ఆపై బ్రోకర్ కన్నన్.. శక్తివేల్‌ మాట్లాడటాన్ని బొత్తిగా మానేశాడు. 
 
శక్తివేల్ తరహాలోనే సేలంకు చెందిన మరో ఇద్దరు యువకులకు రమ్యనే వివాహం చేసేలా పెళ్లి సంబంధాలు ఖాయం చేశాడు. వారి వద్ద కూడా చెరో రూ.25వేల చొప్పున డబ్బు గుంజేశాడు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న ఆ ముగ్గురు యువకులు.. కుమార్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.

ఈ ఘటనపై పోలీసులకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు రమ్య, బ్రోకర్‌లను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments