Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగత్ సింగ్ నాటకం రిహార్సల్ చేస్తుండగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని..?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (18:19 IST)
భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు.. ఆయనపై జరుగుతున్న ఓ నాటకం కోసం రిహార్సల్ చేస్తుండగా.. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన నాగరాజ్ గౌడ, భాగ్యలక్ష్మి దంపతులు తిప్పాజీ సర్కిల్‌లో చిన్నపాటి హోటల్ నడుపుతుంటారు. వీరికి సంజయ్ అనే కుమారుడు వున్నాడు. 
 
బదవానెలోని ఓ స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సంజయ్‌ను ఇంట్లో ఉంచి నాగరాజ్, భాగ్యలక్ష్మీ హోటల్‌కు వెళ్లిపోయారు. అయితే ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న సంజయ్ కనిపించాడు. కిందికి దింపి పరీక్షించగా అప్పటికే ప్రాణం పోయిందని తేలింది. 
 
స్కూలులో త్వరలో జరగబోయే వేడుకలలో పాల్గొనేందుకు భగత్ సింగ్ నాటకాన్ని సంజయ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని తండ్రి నాగరాజ్ చెప్పారు. ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న సంజయ్.. ఉరి వేసుకునే సీన్‌ను ప్రాక్టీస్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయి ఉంటాడని నాగరాజ్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments