Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు.. 88 మంది బాలికల దుస్తులు విప్పదీసి..

క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాశారనే ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో 88 మంది బాలికలను బట్టలూడదీసి నిలబెట్టారు. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా పాఠశాలలో ఈ దారుణం

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (11:22 IST)
క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాశారనే ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో 88 మంది బాలికలను బట్టలూడదీసి నిలబెట్టారు. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా పాఠశాలలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హప్పాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలో ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్‌ కలిసి బాలికల దుస్తులిప్పి నిలబెట్టారు. 
 
క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్యరాతలు రాయగా, ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటికి చెప్పే అంతే సంగతులు అంటూ హెచ్చరించారు. అయితే బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన నిజమేనని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆరు, ఏడు తరగతులు చదివే బాలికల దుస్తులు విప్పి.. ఇలాంటి దారుణ శిక్షను విధించారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments