Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్సిపాల్‌ను తిట్టారనీ అమ్మాయిలను నగ్నంగా నిల్చోబెట్టారు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లు ఉన్మాదులుగా మారిపోతున్నారు. విద్యార్థులు తెలిసోతెలియక చేసే చిన్నపాటి తప్పులకే పెద్దపెద్ద శిక్షలు విధిస్తున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింద

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (14:25 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లు ఉన్మాదులుగా మారిపోతున్నారు. విద్యార్థులు తెలిసోతెలియక చేసే చిన్నపాటి తప్పులకే పెద్దపెద్ద శిక్షలు విధిస్తున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ప్రిన్సిపాల్‌ను దూషించారన్న కారణంతో ఏకంగా 88 మంది విద్యార్థినులను వివస్త్రలను చేసి వరుసగా నిల్చోబెట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాపుమ్‌ పారే జిల్లా తాని హప్ప (ప్రస్తుతం సంగాలీ)లోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదివే కొంతమంది అమ్మాయిలు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేక వ్యాఖ్యాలు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు అసిస్టెంట్ టీచర్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించారు. సహచర విద్యార్థుల సమక్షంలోనే 88 మంది అమ్మాయిలను నగ్నంగా నిల్చోబెట్టారు. 
 
ఈ అమానుష సంఘటన ఈనెల 23వ తేదీన జరిగింది. కానీ బయటకు పొక్కలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన బాధిత విద్యార్థినులు ఆల్‌ సంగాలీ విద్యార్థి సంఘం (ఏఎస్ఎస్‌యు)ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఏఎస్‌ఎస్‌యూ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments