Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాంధుడి చెరనుంచి తప్పించుకునేందుకు శవంలా నటించిన ఎనిమిదేళ్ళ బాలిక!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (11:30 IST)
అత్యాచారాలకు నిలయమైన ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకోవడానికి చాలా చక్యంగా చనిపోయినట్లు నటించి తనను తాను రక్షించుకుంది. 
 
ఈ కేసు పూర్తి వివరాలను పరిశీలిస్తే... అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆరు బయట పడుకున్న చిన్నారిని కామాంధుడు ఎత్తుకుపోయాడు. బాలికకు మెలకువ వచ్చి కళ్లు తెరిచి చూసేసరికి ఇంట్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉండటం చూసి నివ్వెరపోయింది. తనను రక్షించడానికి గట్టిగా అరించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ కామాంధుడు బాలిక నోరును బలవంతంగా మూసేశాడు. దీంతో ఆ దుర్మార్గుడి బారినుండి తప్పించుకోవడానికి ఒక పథకం ఆలోచించింది. 
 
పథకం ప్రకారం ఆమె కదలకుండా ఉండిపోయి, చనిపోయినట్లు నటించింది. దీంతో కామాంధుడు భయపడి బాలికను గిల్లి చూశాడు, అయినా కూడా బాలిక ఒంట్లో ఏమాత్రం చలనం కనిపించలేదు. బాలిక చనిపోయింది అనుకుని నిందితుడు బాలిక నుంచి దూరంగా వెళ్లగానే లేచి ఇంటి వైపు పరుగు తీసింది. నిందితుడు బాలికను పట్టుకునే ప్రయత్నంలో రాయి తగిలి కింద పడిపోయాడు. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments