Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లు కూల్చివేస్తుండగా బయటపడిన బంగారు నిధి... పంచేసుకున్న కూలీలు

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (10:16 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బంగారు గని ఒకటి బయటపడింది. ఓ ఇంటిని కూల్చివేస్తుండగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ బంగారు నాణేలను చూడగానే కూలీలకు దురాశ పుట్టింది. ఆ వెంటనే వారంతా మాట్లాడుకుని ఆ బంగారు నాణేలను పంచుకున్నారు. ఈ కూలీల్లో ఓ తాగుబోతు మాటల సందర్భంలో ఈ బంగారు గని గురించి చెప్పాడు. అంతే, ఈ బంగారు గని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ బంగారు గని సొత్తు విలువ రూ.1.25 కోట్ల మేరకు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌లో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటిని ఇటీవల ఎనిమిది మంది కూలీలు కూల్చివేస్తున్నారు. వారు పనులు మొదలుపెట్టి కొంత భాగాన్ని కూల్చివేశారు. ఆ శిథిలాలను తొలగిస్తున్న సమయంలో ఓ లోహపు పాత్ర కనిపించింది. దానిని తీసుకుని చూడగా అందులో 84 పురాతన బంగారు నాణేలు, ఆభరణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పకుండా ఎనిమిది మంది కూలీలు పంచుకున్నారు. 
 
ఈ క్రమంలో ఓ కూలీ తనకు వచ్చిన వాటాలోని ఓ బంగారు నాణెంను విక్రయించి కొన్ని సరకులతో పాటు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. మిగిలిన సొమ్ముతో మద్యం సేవించాడు. ఆ మత్తులో ఈ బంగారు నాణేల గని వ్యవహారాన్ని బయటపెట్టేశాడు.
 
ఇది ఆ నోటా, ఈ నోటా చేరి చివరకు పోలీసులకు, పురావస్తు శాఖ అధికారులకు చేరింది. దీంతో వారు రంగంలోకి దిగి కూలీలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కూలీలకు దొరికిన లోహపు పాత్రలోని ఆభరణాలు, నాణేల విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అయితే, పురావస్తు శాఖ మాత్రం ఆ సొత్తు విలువ రూ.1.25 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments