Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ లో 24 గంటల్లో 8,635 కరోనా కేసులు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:44 IST)
భారత్‌ లో కరోనా మరణాలు 100 దిగువకు చేరాయి. అలాగే రోజువారీ కేసుల 10వేలలోపునకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 94 మరణాల సంభవించగా.. 8,635 కొత్త కేసులు వెలుగుచూశాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దాంతో ఇప్పటి వరకు 1,07,66,245 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,54,486కి చేరింది. ఎనిమిది నెలల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదకావడం ఇదే తొలిసారి.
 
మరోవైపు రికవరీ రేటు 97శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13,423 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోటీ నాలుగు లక్షల మందికి పైగా వైరస్‌ను జయించారు. ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో క్షీణత కొనసాగింది.

దేశంలో 1,63,353 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.56 శాతానికి తగ్గింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. నిన్న వైద్య సిబ్బంది 6,59,422 మంది నమూనాలను పరీక్షించారు.  

మరోవైపు, జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వరకు 39,50,156 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

నిన్న 1,91,313 మంది టీకా వేయించుకున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ టీకాలను కేంద్రం అత్యవసర వినియోగం కింద వైరస్ ముప్పు పొంచి ఉన్నవారికి అందిస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments