Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌ప్రదేశ్‌: ఒకే స్కూల్‌లో 70మంది విద్యార్థులకు కరోనా

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:48 IST)
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్‌కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, 79 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు వారందరని క్వారంటైన్‌కు తరలించారు. పాఠశాలను మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.
 
తాజా కేసుల నేపథ్యంలో ఈనెల 25 వరకు పాఠశాలలను తెరవకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో సెప్టెంబర్‌ 21 వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరో నాలుగురోజులపాటు బడులను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. 
 
అయితే రెసిడెన్షియల్ స్కూళ్లను దీనినుంచి మినహాయించింది. పాఠశాలలను మూసివేసినప్పటికీ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం 263 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3639కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments