Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాచల్‌ప్రదేశ్‌: ఒకే స్కూల్‌లో 70మంది విద్యార్థులకు కరోనా

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (14:48 IST)
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో ఒకే స్కూల్‌కు చెందిన 79 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మండీ జిల్లాలోని ధరంపూర్ పట్టణంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, 79 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో అధికారులు వారందరని క్వారంటైన్‌కు తరలించారు. పాఠశాలను మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.
 
తాజా కేసుల నేపథ్యంలో ఈనెల 25 వరకు పాఠశాలలను తెరవకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో సెప్టెంబర్‌ 21 వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మరో నాలుగురోజులపాటు బడులను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. 
 
అయితే రెసిడెన్షియల్ స్కూళ్లను దీనినుంచి మినహాయించింది. పాఠశాలలను మూసివేసినప్పటికీ ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో మంగళవారం 263 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3639కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

కన్నప్ప నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీ కాళ హస్తి పాట

Tej Sajja: మిరాయ్ టీజర్ లో మంచు మనోజ్ పాత్ర హైలైట్

Pawan: వీరమల్లు నుంచి తారతార... రొమాంటిక్ సాంగ్ విడుదలైంది

ఎమిరైట్స్ ఫ్లైట్స్‌లో నా చిత్రం ఉంటుంది, ఇప్పుడు మంచి కామెడీ లేదనే బాధ వుంది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments