Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యార్థిని బ్యాంకు ఖాతాలోకి రూ.900 కోట్లు జమ.. ఎలా?

విద్యార్థిని బ్యాంకు ఖాతాలోకి రూ.900 కోట్లు జమ.. ఎలా?
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (15:24 IST)
కొన్ని సందర్భాల్లో బ్యాంకుల్లోని కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దీంతో కొందరి ఖాతాల్లో భారీ నగదు జమ అవుతుంది. మరికొందరి ఖాతాల్లోని డబ్బు ఖాళీ అవుతుంటుంది. తాజాగా ఓ విద్యార్థి ఖాతాలోకి ఏకంగా 900 కోట్ల రూపాయలు జమ అయింది. ఈ మొత్తాన్ని చూసిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఒక్కసారిగా అవాక్కయ్యాయరు. ఇది బీహార్ రాష్ట్రంలోని కటిహార్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు స్కూలు యూనిఫాం తదితర వస్తువులు కొనుక్కోవడం కోసం ఒక ప్రభుత్వ స్కీంకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా వారి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమయ్యాయి. 
 
ఆ డబ్బు తమ ఖాతాలో చేరిందా? అని ఇంటర్నెట్‌లో చెక్ చేస్తే ఒక విద్యార్థి ఖాతాలో రూ.6.2 కోట్లు జమ అయినట్లు కనిపించింది. మరో విద్యార్థి ఖాతాలో ఏకంగా రూ.900 కోట్లు జమైనట్లు తెలిసింది.
 
ఈ విషయం తెలిసిన బ్యాంకు మేనేజర్ ఘటనపై స్పందించారు. బ్యాంకు సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని ఆయన చెప్పారు. నిజానికి సదరు విద్యార్థుల ఖాతాల్లో డబ్బు లేదని, కానీ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో మాత్రం అంత సొమ్ము ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు.
 
కాగా, పట్నా పరిసరాల్లో నివసించే ఒక వ్యక్తి ఖాతాలో ఈ ఏడాది మార్చిలో రూ.5 లక్షలు జమయ్యాయి. ఇవి తనకు మోదీ ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు అని భావించిన అతను ఆ మొత్తాన్ని ఖర్చుపెట్టేశాడు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న ఆఫీసులు... నేడు నివాసాలు : సోనూసూద్‌పై ఐటీ గురి