Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 700 మంది ఖైదీల విడుదల

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (06:43 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సిఎన్‌.అన్నాదురై జయంతి సందర్భంగా ఈనెల 15న రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 700 మంది ఖైదీలను విడుదల చేస్తామని తమిళనాడు సిఎం ఎంకె.స్టాలిన్‌ ప్రకటించారు.

పోలీస్‌ శాఖలో గ్రాంట్ల డిమాండుకు సంబంధించి జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇస్తూ 700 మంది జీవిత ఖైదీల శిక్షను తగ్గించేందుకు, సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని మానవతా కోణంలో వారిని ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేస్తామని వెల్లడించారు. నీట్‌, ప్రభుత్వ మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై గత అన్నాడిఎంకె ప్రభుత్వం పెట్టిన కేసులను కూడా ఉపసంహరిస్తామన్నారు.

సిఎఎ, రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిపై నమోదైన 5,570 కేసులను వెనక్కు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments