Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్ ఆరగించి ఆస్పత్రి పాలైన 70 మంది.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:37 IST)
ఒడిశా రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఐస్‌క్రీమ్ ఆరగించిన 70 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి దుదారి పంచాయతీలో జరిగింది. శనివారం సాయంత్రం పంచాయతీ పరిధిలోని ఘాట్‌గుడ, సొండిపుట్, అల్లిగాం, కమలజ్వాల, నువ్వాపుట్, బడలిగుడ గ్రామాల్లో ఓ వ్యాపారి బండి ఐస్ క్రీమ్ విక్రయించాడు. దీన్ని పిల్లలు పెద్దలు కొనుగోలు చేసి ఆరగించారు. సరిగ్గా రాత్రి భోజనాలు చేసి నిద్రపోయే సమయానికి ఐస్ క్రీమ్ తిన్నవారందరూ ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. 
 
వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందులుపడ్డారు. దీంతో వారందరినీ అప్పటికపుడు దమన్ జోడి, సునాబెడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. నిల్వవున్న ఐస్‌క్రీం తినడం వల్ల అది ఫుడ్‌పాయిజన్‌గా మారడంతో ఇలా జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ప్రీతమ్ పాడి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 60 మంది కోలుకోగా, మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments