చిరుత దాడి.. బహిర్భూమికి వెళ్లిన ఏడేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (15:41 IST)
చిరుత పులులు అడవుల్లో కాకుండా ప్రస్తుతం జన సంచారం వున్న ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇలా గ్రామాలపై పడుతున్న చిరుతల కారణంగా నిత్యం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా చిరుత దాడిలో ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
 
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే మొత్తం ఐదుగురు చిన్నారులు చిరుత దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఐదేళ్ల బాలిక రాత్రి గంటల సమయంలో బహిర్భూమికి వెళ్ళింది. 
 
అప్పటికే పొదలమాటున దాగి ఉన్న చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్రగాయాల పాలైన ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలిసిన వెంటనే అటవీ అధికారులు వచ్చి చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. 
 
కాగా, ఆ ప్రాంతంలో ఇది ఐదో ఘటనగా స్థానికులు చెబుతున్నారు. గత నెల 24న తొలిసారి ఓ బాలికపై చిరుత దాడిచేసింది. వరుస ఘటనలతో తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments