Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుత దాడి.. బహిర్భూమికి వెళ్లిన ఏడేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (15:41 IST)
చిరుత పులులు అడవుల్లో కాకుండా ప్రస్తుతం జన సంచారం వున్న ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఇలా గ్రామాలపై పడుతున్న చిరుతల కారణంగా నిత్యం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా చిరుత దాడిలో ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
 
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీలో ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. దీంతో గత నెల రోజుల వ్యవధిలోనే మొత్తం ఐదుగురు చిన్నారులు చిరుత దాడిలో మరణించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఐదేళ్ల బాలిక రాత్రి గంటల సమయంలో బహిర్భూమికి వెళ్ళింది. 
 
అప్పటికే పొదలమాటున దాగి ఉన్న చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్రగాయాల పాలైన ఆ చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలిసిన వెంటనే అటవీ అధికారులు వచ్చి చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. 
 
కాగా, ఆ ప్రాంతంలో ఇది ఐదో ఘటనగా స్థానికులు చెబుతున్నారు. గత నెల 24న తొలిసారి ఓ బాలికపై చిరుత దాడిచేసింది. వరుస ఘటనలతో తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments