Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 నెలలుగా తల్లీ కుమార్తెలపై 18 మంది కామాంధులు గ్యాంగ్ రేప్..

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన తల్లీ కుమార్తెలపై గ్రామ సర్పంచ్, తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని 18 మంది కామాంధులు గత రెండు నెలలుగా కొనసాగిస్

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:14 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన తల్లీ కుమార్తెలపై గ్రామ సర్పంచ్, తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని 18 మంది కామాంధులు గత రెండు నెలలుగా కొనసాగిస్తూ వచ్చారు.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని కైథాల్ కలాయత్ పట్టణంలో ఓ మహిళ తన 15 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈమె తన కుమార్తెను తీసుకుని గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లింది. అంతే.. వారిద్దరినీ బంధించి అత్యాచారం చేసిన గ్రామ సర్పంచ్.. ఆ తర్వాత తన స్నేహితులను, మాజీ సర్పంచ్‌ను పిలిచి సామూహిక అత్యాచానికి పాల్పడ్డాడు. 
 
ఇలా గత రెండు నెలలుగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే, ఆ కామాంధుల వేధింపులు భరించలేని తల్లీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి 18 మంది నిందితుల్లో ఏడుగురుని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఏఎస్ఐ కూడా ఉండటం గమనార్హం. 
 
ఏఎస్ఐ షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతిలను గుర్తించారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం