Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 నెలలుగా తల్లీ కుమార్తెలపై 18 మంది కామాంధులు గ్యాంగ్ రేప్..

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన తల్లీ కుమార్తెలపై గ్రామ సర్పంచ్, తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని 18 మంది కామాంధులు గత రెండు నెలలుగా కొనసాగిస్

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:14 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన తల్లీ కుమార్తెలపై గ్రామ సర్పంచ్, తన అనుచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని 18 మంది కామాంధులు గత రెండు నెలలుగా కొనసాగిస్తూ వచ్చారు.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని కైథాల్ కలాయత్ పట్టణంలో ఓ మహిళ తన 15 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈమె తన కుమార్తెను తీసుకుని గ్రామ సర్పంచ్ ఇంటికి వెళ్లింది. అంతే.. వారిద్దరినీ బంధించి అత్యాచారం చేసిన గ్రామ సర్పంచ్.. ఆ తర్వాత తన స్నేహితులను, మాజీ సర్పంచ్‌ను పిలిచి సామూహిక అత్యాచానికి పాల్పడ్డాడు. 
 
ఇలా గత రెండు నెలలుగా కొనసాగిస్తూ వచ్చారు. అయితే, ఆ కామాంధుల వేధింపులు భరించలేని తల్లీకూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి 18 మంది నిందితుల్లో ఏడుగురుని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు ఏఎస్ఐ కూడా ఉండటం గమనార్హం. 
 
ఏఎస్ఐ షంషేర్ సింగ్, రోషన్ లాల్, ధనపతిలను గుర్తించారు. ఏఎస్ఐ షంషేర్ సింగ్ తనతోపాటు తన తల్లిపై పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం