Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి మనీ ఇవ్వలేదని భార్యలను చంపేశారు.. ఎవరో తెలుసా?

ఇద్దరు స్నేహితులు తమతమ భార్యలను చంపేశారు. అందులో ఒక మృతదేహాన్ని బావిలో పడేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి ఊరివిడిచి పారిపోయారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (11:01 IST)
ఇద్దరు స్నేహితులు తమతమ భార్యలను చంపేశారు. అందులో ఒక మృతదేహాన్ని బావిలో పడేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టి ఊరివిడిచి పారిపోయారు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... పాలీగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిక్రియా హుస్హరీ ప్రాంతంలో నారద్ మాంఝీ, అఖిలేష్ మాంఝీ అనే ఇద్దరు ప్రాణస్నేహితులు ఉన్నారు. వీరిద్దరూ ఒకే చోట పని చేస్తున్నారు. వీరికి మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో మద్యానికి బానిసలైన వీరిద్దరూ డబ్బుకోసం తమ భార్యలను వేధించేవారు. ఈ క్రమంలో మద్యానికి డబ్బులు ఇవ్వాలని భార్యలను ఒత్తిడి చేయగా, వారు తమ వద్ద లేదని చెప్పారు. 
 
అంతే.. ఆగ్రహించిన వీరిద్దరూ ఇళ్లకు వచ్చి తమ భార్యల గొంతు నొక్కి హత్య చేశారు. ఒక మృతదేహాన్ని బావిలో పారేయగా, మరో మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టి ఆ ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments