Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలోని చెంబూరులో విషాదం... షార్ట్ సర్క్యూట్‌తో ఏడుగురి సజీవదహనం

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (10:42 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై, చెంబూరులో విషాదకర ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుగురు సజీవదహనమయ్యారు. కిందనున్న ఎలక్ట్రిక్ షాపులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించడంతో అందులోని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఈ ఘోరం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. రెండు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఉన్న ఎలక్ట్రిక్ వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అవి వేగంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృత్తుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments