ముంబైలోని చెంబూరులో విషాదం... షార్ట్ సర్క్యూట్‌తో ఏడుగురి సజీవదహనం

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (10:42 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై, చెంబూరులో విషాదకర ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుగురు సజీవదహనమయ్యారు. కిందనున్న ఎలక్ట్రిక్ షాపులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించడంతో అందులోని ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ఈ ఘోరం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. రెండు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఉన్న ఎలక్ట్రిక్ వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. అవి వేగంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృత్తుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments