రాజీవ్ హంతకులకు స్వేచ్ఛను ప్రసాదించిన సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (15:56 IST)
ఎట్టకేలకు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసు ముద్దాయిలు విముక్తి పొందారు. వారికి స్వేచ్ఛను సుప్రీంకోర్టు ప్రసాదించింది. రాజీవ్ హంతకును విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వంతో పాటు రాజీవ్ భార్య, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబం కూడా సముఖత వ్యక్తం చేసిందని, అందువల్ల రాజీవ్ హంతకులను జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
గత 1991 మే 21వ తేదీన తమిళనాడులో శ్రీపెరుంబుదూర‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు  రాజీవ్ హత్యకు గురయ్యాడు. ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థకు చెందిన మహిళా మానవబాంబు థాను తనను తాను పేల్చుకోవడం ద్వారా రాజీవ్ దారుణ హత్యకు గురయ్యాడు. 
 
ఈ కేసులో నళిని, శ్రీహరన్, శాంతన్, మురుగన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, పెరరివాలన్ అనే ముద్దాయిలు తమిళనాడులోని వేలూరు కేంద్ర కారాగారంలో కొన్నేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నారు. వీరిలో పెరరివాలన్‌కు సుప్రీంకోర్టు గత మే నెలలో స్వేచ్ఛను ప్రసాదించింది. ఇపుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో మిగిలిన దోషులు కూడా విడుదల కాబోతున్నారు. జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments