Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు నెలలకు సరిపడా రేషన్ సరకులు - డీజిల్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు..

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (15:48 IST)
తమ డిమాండ్ల పరిష్కరించుకునే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులకు రైతులు చేరుకున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ట్రాక్టర్లతో నగరానికి మంగళవారం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కేంద్ర నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందించిన సమాచారం మేరకు.. 
 
ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచే వందల సంఖ్యలో ట్రాక్టర్లలో రైతులు బయలుదేరారని తెలిపింది. వాటిలో ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు, డీజిల్, ఇతర సామాగ్రిని తీసుకుని బయలుదేరినట్టు పేర్కొన్నారు. కొందరు రైతులు కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్ల నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. సుత్తి, రాళ్లను పగలగొట్టే పరికరాలతో సహా కావాల్సినవన్నీ మా ట్రాలీల్లో ఉన్నాయి. ఆరు నెలలకు సరిపడా రేషన్, డీజిల్‌తో మేం మా ప్రాంతాల నుంచి బయలుదేరాం" అని పేర్కొన్నారు. 
 
కాగా, గత 2020-21లో ఉద్యమించిన పలువురు రైతులు కూడా ప్రస్తుత ఆందోళనలో పాల్గొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో రక్తం గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా నిరసన చేపట్టారు. ఈ రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కానీ, కేంద్ర ప్రభుత్రం మాత్రం డిమాండ్లను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఇపుడు మరోమారు వారు ఆందోళనకు దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments