Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 యేళ్ల బాలికపై ఆరుగురు మైనర్ల అత్యాచారం

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (10:42 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 11 యేళ్ల మైనర్ బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఖుంతి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది. నిందితులు 10 నుంచి 15 యేళ్ల లోపువారు కావడం గమనార్హం. 
 
పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, బాధిత బాలిక పక్క గ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరైంది. అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం‍ సందర్భంగా తనకు ఇంతకుముందే తెలిసిన నిందితులతో వాగ్వివాదం జరిగింది. 
 
ఈ పెళ్లి తర్వాత మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అర్థరాత్రి వేళ స్వగ్రామానికి బయలుదేరింది. ఆ యువతిని అనుసరించిన మైనర్లు కొంతదూరం వచ్చాక అడ్డగించి, ఆ తర్వాత ఎవరూలేని ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక స్నేహితురాళ్లు జరిగిన విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న బాధిత యువతి తల్లిదండ్రులను చూడగానే వారు పారిపోయారు. 
 
అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు తొలుత బాధిత యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువుపోతుందని వెనుకంజ వేశారు. అయితే, ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పడి చివరకు పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధిత యువతి తల్లిదండ్రుల వద్ద ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments