Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో నూడుల్స్ కంపెనీలో భారీ పేలుడు - ఆరుగురు మృత్యువాత!

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (14:29 IST)
బీహార్ రాష్ట్రంలో ఘోర్ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో ఉన్న నూడుల్స్ కంపెనీలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ కారణంగా ఏర్పడిన అగ్నిప్రమాదం వల్ల ఆరుగురు మృత్యువాతపడినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సహాయక సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఇదిలావుంటే, ఈ పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి ఈ కంపెనీలోని బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments