Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడి ప్రేమలేఖ!

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:41 IST)
తన వద్ద చదువుకునే విద్యార్థినికి ఓ ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాశారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. తాను మనసుపడిన విద్యార్థినికి ఉపాధ్యాయుడు స్వయంగా తన చేతిరాతతో ప్రేమలేఖ రాశారు. దీనిపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. పైగా, ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించి గురువుని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 
 
ఇంతకీ ప్రేమలేఖ రాసిన ఉపాధ్యాయుడి వయసు 47 యేళ్లు. బాలిక వయసు 13 యేళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హరిఓమ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు గత డిసెంబరు నెల 30వ తేదీన ఓ బాలికకు కొత్త సంవత్సర గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. 
 
ఆ తర్వాత దాన్ని ఇంటికెళ్లి చదువుకోమని చెప్పాడు. అభంశుభం తెలియని ఆ విద్యార్థిని కూడా అలానే చేసింది. ఆ విద్యార్థిని ఆ లేఖను చదివిన తర్వాత నేరుగా తన తల్లిదండ్రులకు విషయం చెప్పిందే. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments