Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడి ప్రేమలేఖ!

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (09:41 IST)
తన వద్ద చదువుకునే విద్యార్థినికి ఓ ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాశారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. తాను మనసుపడిన విద్యార్థినికి ఉపాధ్యాయుడు స్వయంగా తన చేతిరాతతో ప్రేమలేఖ రాశారు. దీనిపై బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. పైగా, ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా స్పందించి గురువుని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 
 
ఇంతకీ ప్రేమలేఖ రాసిన ఉపాధ్యాయుడి వయసు 47 యేళ్లు. బాలిక వయసు 13 యేళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లార్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హరిఓమ్ సింగ్ అనే ఉపాధ్యాయుడు గత డిసెంబరు నెల 30వ తేదీన ఓ బాలికకు కొత్త సంవత్సర గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. 
 
ఆ తర్వాత దాన్ని ఇంటికెళ్లి చదువుకోమని చెప్పాడు. అభంశుభం తెలియని ఆ విద్యార్థిని కూడా అలానే చేసింది. ఆ విద్యార్థిని ఆ లేఖను చదివిన తర్వాత నేరుగా తన తల్లిదండ్రులకు విషయం చెప్పిందే. వారు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments