Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా సంక్షోభం.. అంతకంతకూ పెరుగుతున్న ఏక్‌నాథ్ షిండే బలం

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (14:07 IST)
మహారాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని ప్రభుత్వం పతనం అంచున ఉంది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ పార్టీకే చెందిన సీనియర్, కీలక నేత ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ప్రకటించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బుధవారానికి 40 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంది. తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనకు మద్దతునిచ్చే స్వతంత్రులతో కలుపుకుని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 46కు చేరింది. కొత్తగా మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా గౌహతికి చేరుకున్నారు. 
 
ఇదిలావుంటే, తమ పార్టీకే చెందిన శాసనసభ సభ్యులు తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాత్రే తన అధికారిక నివాసం వర్షను ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి చేరుకున్నారు. అయితే, శివసేన ఎమ్మెల్యేలు కోరితే తాను సీఎం పదవినే కాదు పార్టీ అధ్యక్ష పదవిని కూడా త్యజించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
అంతేకాకుండా తాను బాల్‌ఠాక్రే కుమారుడునని, అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. హిందుత్వ అజెండాను శివసేన పార్టీ ఎన్నటికీ వీడిబోదని, తనపై తిరుగుబాటు చేసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికులే కూర్చొంటారని గ్యారెంటీ ఉందా అని ఆయన రెబెల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments