Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా సంక్షోభం.. అంతకంతకూ పెరుగుతున్న ఏక్‌నాథ్ షిండే బలం

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (14:07 IST)
మహారాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని ప్రభుత్వం పతనం అంచున ఉంది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ పార్టీకే చెందిన సీనియర్, కీలక నేత ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ప్రకటించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బుధవారానికి 40 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంది. తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనకు మద్దతునిచ్చే స్వతంత్రులతో కలుపుకుని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 46కు చేరింది. కొత్తగా మద్దతు ప్రకటించిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా గౌహతికి చేరుకున్నారు. 
 
ఇదిలావుంటే, తమ పార్టీకే చెందిన శాసనసభ సభ్యులు తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాత్రే తన అధికారిక నివాసం వర్షను ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి చేరుకున్నారు. అయితే, శివసేన ఎమ్మెల్యేలు కోరితే తాను సీఎం పదవినే కాదు పార్టీ అధ్యక్ష పదవిని కూడా త్యజించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
అంతేకాకుండా తాను బాల్‌ఠాక్రే కుమారుడునని, అధికారం కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. హిందుత్వ అజెండాను శివసేన పార్టీ ఎన్నటికీ వీడిబోదని, తనపై తిరుగుబాటు చేసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికులే కూర్చొంటారని గ్యారెంటీ ఉందా అని ఆయన రెబెల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments