Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక పేలుళ్లలో జేడీఎస్ నేతలు మృతి... మరికొందరు మిస్సింగ్

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:25 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం వరుసబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో 250 మంది వరకు చనిపోయారు. మరికొంతమంది గాయపడి చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ పేలుళ్ళలో చనిపోయిన వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. విహార యాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు ఆచూకీ తెలియకపోవడమే. 
 
ఇదే అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ఓ ట్వీట్ చేశారు. "తమ పార్టీ జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌)కు చెందిన ఏడుగురు నేతలు శ్రీలంకలో అదృశ్యమయ్యారు. ఎన్నికల ప్రచారం అనంతరం మారెగౌడ, పుట్టారాజు, శివణ్ణ, లక్ష్మీనారాయణ, హనుమంతరాయప్ప, రమేష్‌, రంగప్పలు ఈనెల 20న శ్రీలంక వెళ్లారు. బాంబు పేలుళ్లు జరిగిన కొలంబోలోని ద షాంగ్రిలా హోటల్‌లోనే వీరు బస చేసినట్టు తెలిసింది. పేలుళ్లు జరిగిన తర్వాత వీరు అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ ఏడుగురిలో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments