Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక పేలుళ్లలో జేడీఎస్ నేతలు మృతి... మరికొందరు మిస్సింగ్

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:25 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం వరుసబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో 250 మంది వరకు చనిపోయారు. మరికొంతమంది గాయపడి చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ పేలుళ్ళలో చనిపోయిన వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం.. విహార యాత్ర కోసం శ్రీలంకకు వెళ్లిన పలువురు ఆచూకీ తెలియకపోవడమే. 
 
ఇదే అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి ఓ ట్వీట్ చేశారు. "తమ పార్టీ జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌)కు చెందిన ఏడుగురు నేతలు శ్రీలంకలో అదృశ్యమయ్యారు. ఎన్నికల ప్రచారం అనంతరం మారెగౌడ, పుట్టారాజు, శివణ్ణ, లక్ష్మీనారాయణ, హనుమంతరాయప్ప, రమేష్‌, రంగప్పలు ఈనెల 20న శ్రీలంక వెళ్లారు. బాంబు పేలుళ్లు జరిగిన కొలంబోలోని ద షాంగ్రిలా హోటల్‌లోనే వీరు బస చేసినట్టు తెలిసింది. పేలుళ్లు జరిగిన తర్వాత వీరు అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ ఏడుగురిలో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది" అని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments