Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై రైల్వే స్టేషన్‌లో పర్యాటక రైలులో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (09:20 IST)
ఆలయాల నగరంగా ప్రసిద్ధిగాంచిన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని రైల్వే స్టేషన్‌లో ఆగివున్న పర్యాటక రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ రైలులోని ప్యాంట్రీకార్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 10 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. మరికొందరు గాయపడ్డారు. 
 
లక్నో నుంచి రామేశ్వరం ప్రాంతాలను కలుపుతూ రైల్వే శాఖ పర్యాటక రైలును నడుపుతుంది. ఈ రైలు మదురై స్టేషన్‌కు వచ్చి ఆగింది. శనివారం ఉదయం రైలులోని ప్యాంట్రీకార్‌లో వంట పనుషులు తేనీరు పెట్టేందుకు గ్యాస్ స్టౌ వెలిగించారు. ఆ సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో తొలుత ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చినప్పటికి ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments