Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఈశాన్యంగా భూకంప కేంద్రం

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (17:20 IST)
గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. సోమవారం కూడా మరో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. సోమవారం ఉదయం 9.11 గంటల ప్రాంతంలో ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంచించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైనట్టు జాతీయ భూకంపాల నమోదు కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ) వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం పితోర్‌ఘర్‌కు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
కాగా, ఇటీవలే నేపాల్‌‍లో 6.2 తీవ్రవతో భారీ భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం కూడా దేశ రాజధాని ఢిల్లీ, ఎన్.సి.ఆర్ రీజియన్‌లో భూప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments