Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకడంతో ఉద్యోగం నుంచి తొలగింపు.. సూసైడ్ చేసుకున్న జర్నలిస్టు

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (08:49 IST)
కరోనా సోకిందన్న కారణంతో ఉద్యోగిని ప్రముఖ పత్రిక ఉద్యోగం నుంచి తప్పించింది. దీంతో దిక్కుతోచని ఆ జర్నలిస్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ దినపత్రికలో తరుణ్ సిసోడియా అనే యువకుడు విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. 
 
దీంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఇదేసమయంలో వైరస్ బారిన పడ్డాడన్న కారణంతో అతన్ని పత్రిక యాజమాన్యం ఉద్యోగం నుంచి తీసేసినట్టు తెలిసింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన అతను, ఎయిమ్స్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని కాపాడేందుకు ఆసుపత్రి వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. చికిత్స పొందుతూ అతను మరణించాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments