Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్వాన్ లోయలో 100 మంది చైనా సైనికుల మృతి???

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (08:44 IST)
గత నెల 15వ తేదీన తూర్పు లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో భారత్ సైన్యానికి చెందిన 21 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా వైపున కూడా అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, 40 నుంచి 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మృతుల సంఖ్యపై చైనా ఎన్నడూ పెదవి విప్పలేదు. 
 
ఈ క్రమంలో చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారి క్సీ ఒకరు తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. చైనాకు చెందిన సైనికులు 100 మందికి పైగా ఈ ఘర్షణలో చనిపోయారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదేసమయంలో చైనా ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని కూడా ఆరోపించారు. గాల్వాన్ వ్యాలీలో అసలు ఏం జరిగిందన్నది చైనా తరపు నుంచి ఎన్నడూ బయటకు రాదని ఆయన అన్నారు.
 
గాల్వాన్ లోయలో పెద్ద యుద్ధమే జరిగిందనీ, అక్కడ 100 మందికిపైగా చైనా సైనికులు మరణించారని వెల్లడించిన సీపీఏ మాజీ సైనికుడు క్సీ, ఆ ప్రాంతానికి చైనా మరిన్ని బలగాలను తరలించినా, అక్కడి పరిస్థితులు ఇండియాకే అనుకూలమని అన్నారు. క్సీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments