Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేల్లో 68 మందికి నేరచరిత్ర.. వీళ్లంతా ప్రజాప్రతినిధులా..?!

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:30 IST)
తమిళనాడులో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 68 మంది అంటే 33 శాతం నేరచరిత్ర కలిగినవారే ననే పోల్‌రైట్స్‌ గ్రూప్‌ ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. ఆయా ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ నివేదిక తెలియజేసింది. 
 
సిటింగ్‌ ఎమ్మెల్యేలలో 38 మంది అంటే 19 శాతంపై నాన్‌ బెయిలబుల్‌, ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఆస్కారమున్న క్రిమినల్‌ కేసులు ఉన్నాయని సదరు నివేదిక వివరించింది. వీరిలో ప్రతిపక్ష డీఎంకేకు చెందినవారు 40 మంది ఉంటే.. అధికార అన్నాడీఎంకేలో 23 మంది ఉన్నారు.
 
ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు, డీఎంకేలో 22 మంది, అన్నాడీఎంకేలో 13 మంది, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇక, ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసులు, మహిళలపై నేరానికి పాల్పడ్డారంటూ ఇద్దరిపై కేసులు ఉన్నాయి. తమళనాడులో కోటీశ్వరులకు కూడా కొదవలేదు.. 157 మంది అంటే 77 శాతం మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలు కోటీశ్వరులని నివేదిక చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments