Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేల్లో 68 మందికి నేరచరిత్ర.. వీళ్లంతా ప్రజాప్రతినిధులా..?!

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:30 IST)
తమిళనాడులో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 68 మంది అంటే 33 శాతం నేరచరిత్ర కలిగినవారే ననే పోల్‌రైట్స్‌ గ్రూప్‌ ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. ఆయా ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ నివేదిక తెలియజేసింది. 
 
సిటింగ్‌ ఎమ్మెల్యేలలో 38 మంది అంటే 19 శాతంపై నాన్‌ బెయిలబుల్‌, ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఆస్కారమున్న క్రిమినల్‌ కేసులు ఉన్నాయని సదరు నివేదిక వివరించింది. వీరిలో ప్రతిపక్ష డీఎంకేకు చెందినవారు 40 మంది ఉంటే.. అధికార అన్నాడీఎంకేలో 23 మంది ఉన్నారు.
 
ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు, డీఎంకేలో 22 మంది, అన్నాడీఎంకేలో 13 మంది, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇక, ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసులు, మహిళలపై నేరానికి పాల్పడ్డారంటూ ఇద్దరిపై కేసులు ఉన్నాయి. తమళనాడులో కోటీశ్వరులకు కూడా కొదవలేదు.. 157 మంది అంటే 77 శాతం మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలు కోటీశ్వరులని నివేదిక చెబుతోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments