బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (22:44 IST)
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఉసురు పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా చేపట్టిన ఆపరేషన్‌లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్టు సీఆర్పీఎఫ్ డీజీపీ జీపీ సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతం ప్రకటించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను బుధవారం బీజాపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. 
 
సుమారు 21 రోజులు పాటు సాగిన ఈ కీలక ఆపరేషన్‌లో మృతి చెందిన 31 మంది మావోయిస్టులలో 16 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. హతమైన మావోయిస్టులపై ప్రభుత్వం గతంలో మొత్తం రూ.1.72 కోట్ల రివార్డును ప్రకటించిన పేర్కొన్నారు. ఈ ఎదురుకాల్పులు, ఆపరేషన్‌ క్రమంలో 18 మంది భద్రతా సిబ్బంది గాయపడినట్టు వెల్లడించారు. మరణించిన మావోయిస్టులలో ఇప్పటివరకు 20 మంది గుర్తించామని, మరో 11 మందిని గుర్తించాల్సి వుందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి 35 అత్యాధునిక ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 
 
ఈ యేడాది ఏప్రిల్ 21 వ తేదీన ప్రారంభమైన కర్రెగుట్ట ఆపరేషన్‌ మే 11వ తేదీ వరకు కొనసాగిందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం 174 మంది కరుడుగట్టిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు వారు ఈ సందర్భంగా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments