Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన వంతెన: 30 మంది విద్యార్థులకు గాయాలు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (17:21 IST)
bridge collapses
అసోంలో వేలాడే వంతెన కుప్పకూలిన ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన సోమవారం కరీంగంజ్ జిల్లాలోని రతబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరగి ప్రాంతంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. సింగ్లా నదిపై వేలాడే వంతెన చెరగి ప్రాంతాన్ని గ్రామంతో కలుపుతుంది. విద్యార్థులు, స్థానికులు అనేక సంవత్సరాలుగా ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు.
 
సోమవారం సాయంత్రం చెరగి విద్యాపీఠ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా, వేలాడే వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. వంతెనపై నడుస్తున్న విద్యార్థులు నదిలో పడిపోయారు. దాదాపు 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో పడిపోయిన విద్యార్థులను రక్షించారు. వేలాడే వంతెన మూడేండ్ల క్రితం నిర్మించినట్లు గ్రామస్తులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments