Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన వంతెన: 30 మంది విద్యార్థులకు గాయాలు

30 students
Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (17:21 IST)
bridge collapses
అసోంలో వేలాడే వంతెన కుప్పకూలిన ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన సోమవారం కరీంగంజ్ జిల్లాలోని రతబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరగి ప్రాంతంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. సింగ్లా నదిపై వేలాడే వంతెన చెరగి ప్రాంతాన్ని గ్రామంతో కలుపుతుంది. విద్యార్థులు, స్థానికులు అనేక సంవత్సరాలుగా ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు.
 
సోమవారం సాయంత్రం చెరగి విద్యాపీఠ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా, వేలాడే వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. వంతెనపై నడుస్తున్న విద్యార్థులు నదిలో పడిపోయారు. దాదాపు 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో పడిపోయిన విద్యార్థులను రక్షించారు. వేలాడే వంతెన మూడేండ్ల క్రితం నిర్మించినట్లు గ్రామస్తులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments