Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలికపై సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచారం.. ఏడుపు విని..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (14:12 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నా.. కఠినమైన శిక్షలను తెచ్చేందుకు చట్టంలో సవరణలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. తాజాగా ఢిల్లీలో ఇంటికి కాపలా కాసే సెక్యూరిటీ గార్డ్.. ఆ ఇంట్లో ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగే చిన్నారిని కాటేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌లో.. రంజీత్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రంజీత్ అనే భవనంలో ఉన్న మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ సమయంలో బాలిక ఏడుపును గమనించిన స్థానికులు రంజీత్‌కు దేహశుద్ధి చేశారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
మరోవైపు ఈ అత్యాచార ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ ఫైర్ అయ్యారు. నిర్భయ ఘటన చోటు చేసుకుని ఆరేళ్లైనప్పటికీ దేశ రాజధానిలో ఇంకా బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని స్వాతి మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం