Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంసారానికి రాలేదని, స్నేహితులతో కలిసి వెళ్లాడు.. భార్యను తుపాకీతో కాల్చేశాడు..

సంసారానికి రాలేదని, స్నేహితులతో కలిసి వెళ్లాడు.. భార్యను తుపాకీతో కాల్చేశాడు..
, బుధవారం, 12 డిశెంబరు 2018 (12:53 IST)
తాగిన మైకంలో స్నేహితులతో కలిసి ఓ భర్త భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన హర్కేష్ కుమార్-కవిత కుమారికి గత ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. హర్కేష్‌కు తాగుడు అలవాటు వుంది. ఈ అలవాటుతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
ఎంత చెప్పినా భర్త తాగుడును వదిలిపెట్టకపోవడంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యపట్ల ద్వేషాన్ని పెంటుకున్న హర్కేష్ కుమార్ తాగిన మైకంలో తన స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్లి.. భార్యతో వాగ్వివాదానికి దిగాడు. 
 
ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. అయితే తాగుడును మానితేనే ఇంటికి వస్తానని కవిత తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన హర్కేష్ తుపాకీతో ఆమెను షూట్ చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న హర్కేష్‌తో పాటు అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ దిగ్గజాలను గురిచూసి కొట్టిన కేసీఆర్.. అదృష్టం కొద్దీ తప్పించుకున్న జగ్గారెడ్డి