Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత: ముగ్గురు హతం

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (12:36 IST)
జమ్మూ-కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గత రెండు వారాల నుంచి జమ్మూ కాశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లల్లో దాదాపు 8 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కాశ్మీర్ పోలీసులు తెలిపారు. 
 
తాజాగా ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. బుడ్గాం పరిధిలోని జోల్వా క్రాల్పోరా ఛదూరా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారినుంచి 3 ఏకే 47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
 
ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గురువారం రాత్రినుంచి స్థానిక పోలీసులు, బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments