పాత ఇల్లు కొన్నాడు.. అంతే షాకయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే..?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (21:58 IST)
హర్యానాలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. రెండున్నరేళ్ల క్రితం ఓ పాత ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తికి షాక్ తప్పలేదు. ఆ ఇంటిని పునర్మించే క్రమంలో అస్థిపంజరాలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని పానిపట్ శివనగర్ కాలనీలో ఓ ఇంట్లో పునర్ నిర్మాణ పనులు జరిగేటప్పుడు మూడు అస్థి పంజరాలను గుర్తించారు. వికాస్ కుమార్ అనే వ్యక్తి రెండున్నర సంవత్సరాల క్రితం ఒక పాత ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి సంబంధించి కొంతభాగం రోడ్డుపై ఉండటంతో దానిని తీసివేసి పునర్నిర్మించాలని మరమ్మతు పనులను చేపట్టాడు. 
 
అయితే మరమ్మతు పనులు చేసేటప్పుడు ఇంట్లోని ఒక మూల నుంచి కీటకాలు కుప్పలు కుప్పలుగా బయటికి వస్తున్నాయి. అయితే వాటిని చూసి కొంతకాలం ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే నిర్మాణంలో భాగంగా తవ్వకాలు చేస్తున్నప్పుడు కీటకాలను చూసిన వ్యక్తులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని భావించారు. అవి బయటికి వస్తున్న స్థలం దగ్గర తవ్వేసరికి అక్కడ మూడు మానవ అస్తి పంజరాలను కనుగొన్నారు. వెంటనే భయబ్రాంతులకు గురైన వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
 
అందులో భాగంగా ఇంటి యజమాని కుమార్‌ని ప్రశ్నించగా తాను రెండున్నర సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కొన్నానని అంతకు ముందు ఈ ఇంటిని మరో ఇద్దరు కొనుగోలు చేశారని అంతకు మించి తనకు ఏ విషయాలు తెలియదని చెప్పాడు. అసలు అక్కడికి అస్థి పంజరాలు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిఫుణుల సహాయంతో అస్థిపంజరాలపై పరీక్షలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments