Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారుల ప్రాణాలు తీసిన ట్రైన్

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (13:26 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పట్టాలపై కూర్చొని పండ్లు ఆరగిస్తున్న నలుగురు చిన్నారులను ఓ రైలు ఢీకొట్టింది. దీంతో ఆ నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరం పంజాబ్ రాష్ట్రంలోని కిరత్‌పూర్ సాహిబ్‌‌లో జరిగింది. 
 
సట్లేజ్ నదిపై ఉన్న లొహంద్ రైల్వే బ్రిడ్జి సమీపంలో నలుగురు చిన్నారులు చెట్లకు ఉన్న పండ్లను తెంపుకుని ఆ పక్కనే ఉన్న పట్టాలపై కూర్చొని ఆరగిస్తున్నారు. ఆ సమయంలో  సహరాన్ పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఓ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వెళుతున్నది. 
 
అయితే, ఈ రైలును ఆ చిన్నారులు గమనించలేదు. వారు పట్టాలపైనే కూర్చొని పండ్లు తింటూ కూర్చొన్నారు. దీంతో వారిని రైలు ఢీకొట్టడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments