Webdunia - Bharat's app for daily news and videos

Install App

#NTPCExplosion : ప్రధాని దిగ్భ్రాంతి.. బాధితులకు రాహుల్ పరామర్శ

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఉన్చాహర్‌లోని ఎన్టీపీసీ ఆరో ప్లాంట్‌లో జరిగిన భారీ పేలుడులో చనిపోయిన వారి సంఖ్య 26కు చేరింది. మరో 100 మందికి గాయాలయ్యాయి. బాయిలర్ ప్లాంట్‌లోని స్టీమ్‌పైపు పేలడంతో ప

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (13:01 IST)
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఉన్చాహర్‌లోని ఎన్టీపీసీ ఆరో ప్లాంట్‌లో జరిగిన భారీ పేలుడులో చనిపోయిన వారి సంఖ్య 26కు చేరింది. మరో 100 మందికి గాయాలయ్యాయి. బాయిలర్ ప్లాంట్‌లోని స్టీమ్‌పైపు పేలడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో దాదాపు 150మంది కార్మికులు ఉన్నారు. 
 
భారీ పేలుడుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడిన కార్మికులకు రూ.25వేల నష్టపరిహారాన్ని యూపీ సీఎం మంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందిస్తూ ఇది చాలా భయానకమైన, దురదృష్టకర సంఘటన అని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
 
కాగా, ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఉదయమే రాయ్‌బరేలికి వచ్చారు. అక్కడ హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments