Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో 24,712 కొత్త కరోనా కేసులు..312 మరణాలు

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (12:14 IST)
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. బుధవారం 10,39,645 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 24,712మందికి పాజిటివ్‌గా తేలింది. అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే 3 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. జనవరి 30న తొలికేసు వెలుగుచూసిన దగ్గరి నుంచి 1,01,23,778 మంది వైరస్ బారిన పడ్డారు.
 
ఇక క్రియాశీల కేసుల సంఖ్య 2,83,849గా ఉండగా.. ఆ రేటు 2.80 శాతానికి చేరింది. నిన్నటితో 96,93,173 (95.75శాతం) మంది కొవిడ్‌-19 నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 312 మంది మరణించగా.. ఇప్పటి వరకు ఈ మహమ్మారికి 1,46,756 మంది బలయ్యారు.

డిసెంబర్ 1 నుంచి 22వరకు వారాల వ్యవధిలో మొదటి ఐదు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల్లో చోటుచేసుకున్న మార్పును మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. ఆ రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ ఉండగా.. మహారాష్ట్రలో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments