Webdunia - Bharat's app for daily news and videos

Install App

యమునా నదిలో పడవ ప్రమాదం - 20 మంది మృతి

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (18:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా నదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. 
 
యమునా నదిలో 50 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి బోల్తా పడింది. కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కవడంతో ఈ బోటు బోల్తాపడినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 25 మంది వరకు గల్లంతైనట్టు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
సహాయక బృందాలు ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, పడవ బోల్తాపడగానే అందులోని వారంతా నదిలో మునిగిపోయారు. వీరిలో ఈత తెలిసిన వారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments