Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకాశ్మీర్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదులు.. ఇద్దరు టీచర్ల హతం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (13:53 IST)
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పెచ్చరిల్లిపోతున్నాయి. శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు ఓ టీచర్‌ను హతమార్చారు. అలాగే గురువారం ఈద్గాం సంగం పాఠశాలపై ఉగ్రవాదులు చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులపై పాయింట్ బ్లాక్‌లో కాల్పులు జరిపారు. 
 
దీంతో వారిద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన టీచర్లను సిక్కు, కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సతీందర్ కౌర్‌, దీపక్ చాంద్‌గా పోలీసులు గుర్తించారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేసి.. ఉగ్రవాదుల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు వెల్లడించారు పోలీసులు.
 
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాజా హత్యలను ఖండించారు. మంగళవారం కూడా ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మసీ షాపు ఓనర్ 70 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు కాల్చి చంపారు. 
 
రాత్రి ఏడు గంటల సమయంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతన్ని కాల్చారు. 1990 దశకంలో కశ్మీరీ పండిట్ బింద్రూ ఉగ్రవాదం హెచ్చు స్థాయిలో ఉన్న సమయంలోనూ ఫార్మసీ నడిపారు. కాగా.. గత ఐదు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments