Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకాశ్మీర్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదులు.. ఇద్దరు టీచర్ల హతం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (13:53 IST)
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పెచ్చరిల్లిపోతున్నాయి. శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు ఓ టీచర్‌ను హతమార్చారు. అలాగే గురువారం ఈద్గాం సంగం పాఠశాలపై ఉగ్రవాదులు చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులపై పాయింట్ బ్లాక్‌లో కాల్పులు జరిపారు. 
 
దీంతో వారిద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన టీచర్లను సిక్కు, కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సతీందర్ కౌర్‌, దీపక్ చాంద్‌గా పోలీసులు గుర్తించారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేసి.. ఉగ్రవాదుల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు వెల్లడించారు పోలీసులు.
 
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాజా హత్యలను ఖండించారు. మంగళవారం కూడా ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మసీ షాపు ఓనర్ 70 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు కాల్చి చంపారు. 
 
రాత్రి ఏడు గంటల సమయంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతన్ని కాల్చారు. 1990 దశకంలో కశ్మీరీ పండిట్ బింద్రూ ఉగ్రవాదం హెచ్చు స్థాయిలో ఉన్న సమయంలోనూ ఫార్మసీ నడిపారు. కాగా.. గత ఐదు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments