Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి విమానంలో రచ్చ చేసిన ప్రయాణికులు

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (13:19 IST)
మద్యం సేవించిన ఇద్దరు ప్రయాణికులు విమానంలో రచ్చ చేశారు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దుర్భాషలాడారు. దుబాయ్ నుంచి ముంబైకు వస్తున్న విమానంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ విమానంలో ప్రయాణించిన దత్తాత్రేయ బాపార్‌దేకర్, జాన్ జార్జ్ డిసౌజా అనే ఇద్దరు ప్రయాణికులు మద్యం సేవించినట్టు తేలింది. 
 
వీరిద్దరూ గల్భ్ నుంచి వస్తూ అక్కడి డ్యూటీ షాపులో మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత విమానమెక్కిన తర్వాత అందులో మద్యం సేవించడం మొదలుపెట్టారు. దీనిపై తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయగా, వారిపై నోరు పారేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల్లో ఒకరు మద్యం బాటిల్ చేతిలో పట్టుకుని ఐల్‌లో నిర్లక్ష్యంగా నడుస్తూ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది పెట్టాడు. 
 
దీంతో విమానం సిబ్బంది ఆ వ్యక్తి చేతిలోని మద్యం బాటిల్‌ను బలవంతంగా తీసుకున్నారు. ఈ ఘటనపై క్రూ సిబ్బంది ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు. విమానం ముంబైకు చేరుకోగానే ఆ ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై సెక్షన్ 336తో పాటు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్‌లోని 21, 22, 25 నిబంధనల కింద కేసు నమోదు చేశారు. 
 
ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన సంఘటనలు జరిగిన విషయం తెల్సిందే. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు ఏడు జరిగాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments