Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల్లోనే యువకుడు మృతి

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (21:08 IST)
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 48 గంటల్లోనే ఒక 19 సంవత్సరాల యువకుడు మరణించాడు. వ్యాక్సినేషన్ నియమ నిబంధనలన్నీ పాటించామని, భోపాల్‌లోని ఎయిమ్స్ నుంచి పోస్ట్‌మార్టమ్ నివేదిక అందిన తర్వాత ఆ యువకుడి మరణానికి గల కారణాలు తెలుస్తాయని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. భన్వర్ గ్రామలో ఈ నెల 6వ తేదీన శుభం పర్మార్ అనే యువకుడు కొవిడ్-19 మొదటి డోసు టీకా వేసుకున్నాడు. 
 
టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే కూర్చున్న అతను మామూలుగానే తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతనికి వాంతులు కావడంతో ఆస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సెహోర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం మరణించాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మృతదేహానికి భోపాల్‌లోని ఎయిమ్స్ డాక్టర్లు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత యువకుడి మరణానికి అసలు కారణం ఏమిటో తెలుస్తుందని ఆస్తా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments