Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల్లోనే యువకుడు మృతి

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (21:08 IST)
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 48 గంటల్లోనే ఒక 19 సంవత్సరాల యువకుడు మరణించాడు. వ్యాక్సినేషన్ నియమ నిబంధనలన్నీ పాటించామని, భోపాల్‌లోని ఎయిమ్స్ నుంచి పోస్ట్‌మార్టమ్ నివేదిక అందిన తర్వాత ఆ యువకుడి మరణానికి గల కారణాలు తెలుస్తాయని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. భన్వర్ గ్రామలో ఈ నెల 6వ తేదీన శుభం పర్మార్ అనే యువకుడు కొవిడ్-19 మొదటి డోసు టీకా వేసుకున్నాడు. 
 
టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే కూర్చున్న అతను మామూలుగానే తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతనికి వాంతులు కావడంతో ఆస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సెహోర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం మరణించాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మృతదేహానికి భోపాల్‌లోని ఎయిమ్స్ డాక్టర్లు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత యువకుడి మరణానికి అసలు కారణం ఏమిటో తెలుస్తుందని ఆస్తా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments